Telangana corona cases : రాష్ట్రంలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!

Telangana corona cases : రాష్ట్రంలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!
Telangana corona cases : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana corona cases : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఒకరు మరణించారు. ఇక 351 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 97.26 శాతంగా ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్తగా 1,042, మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 201, రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 51, హ‌నుమ‌కొండ‌లో 47, మంచిర్యాల‌లో 38, నిజామాబాద్‌లో 26, ఖ‌మ్మంలో 27, మ‌హ‌బూబాబాద్‌, పెద్ద‌ప‌ల్లిలో 25 కేసుల చొప్పున‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 22 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story