కరోనాపై నిర్లక్ష్యం.. గ్రామంలో 29 మందికి వైరస్..!

కరోనాపై నిర్లక్ష్యం.. గ్రామంలో 29 మందికి వైరస్..!
కరోనాపై నిర్లక్ష్యంతో ఓ గ్రామంలో 29 మంది వైరస్ బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో 29 మంది స్థానికులకు కరోనా సోకింది.

కరోనాపై నిర్లక్ష్యంతో ఓ గ్రామంలో 29 మంది వైరస్ బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో 29 మంది స్థానికులకు కరోనా సోకింది. ఇటీవలే ఎడపల్లిలో ఓ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. అది చూడడానికి వెళ్లిన కొంతమది గ్రామస్థులను కరోనా కాటేసింది. గత వారం ఎడపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు.. వారం రోజులుగా గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆ గ్రామ సర్పంచ్‌తో సహా 29 మందికి కరోనా పాటిజివ్ రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జిల్లా వైద్యాధికారులు ఆ గ్రామానికి చేరుకొని గ్రామస్థులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ శానిటైజేషన్ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story