Warangal: వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే కుటుంబంలో అయిదుగురు మృతి..

Warangal: వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే కుటుంబంలో అయిదుగురు మృతి..
Warangal: పెళ్లి సామాగ్రి కొనుగోలు కోసం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. పెళ్లి సామాగ్రి కొనుగోలు కోసం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మృతులు అంతా ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారు పర్ష తండా వాసులుగా గుర్తించారు..VIS

ఈనెల 24న పెళ్లి వేడుకల కోసం పర్షా తండా నుంచి నర్సంపేటకు ట్రాక్టర్‌లో బయలుదేరిన తొమ్మిది మంది గిరిజనులు.. తండా శివారులోని చెరువుకట్టపై నుంచి దిగుతుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న గూగులోతు గోవిందు, కాంతమ్మ, శీత అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన మరో ఇద్దరు నర్సంపేట ఏరియా ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. పెళ్లి సంబరాల్లో మునిగితేలాల్సిన ఇంట్లో.. కుటుంబసభ్యుల మృతి తీవ్ర విషాదం నింపింది.

Tags

Read MoreRead Less
Next Story