కరోనా సెకండ్ వేవ్.. ఎటువంటి లక్షణాలు లేకుండానే 90శాతం కేసులు...!

కరోనా సెకండ్ వేవ్.. ఎటువంటి లక్షణాలు లేకుండానే 90శాతం కేసులు...!
కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. నిర్మల్ జిల్లా ముథోల్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.

కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. నిర్మల్ జిల్లా ముథోల్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ముథోల్, భైంసాలో విద్యార్థులకు కరనా పరీక్షలు నిర్వహించారు. భైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో 39 మందికి కరనా రావడం కలకలరం రేపుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ముథోల్‌లోని తెలంగాణ గిరిజన బాలికల కళాశాలలో 10 మంది బాలికలు, ఒక ఉపాధ్యాయునికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో 9 మంది బాలికలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థినులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్నారు. గతకొద్ది రోజులుగా స్కూళ్లలో కరోనా కేసులు వెలుగుచూడడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటు ఖమ్మం జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ముదిగొండ మండలం పెదమండవలోని ప్రభుత్వ పాఠశాలలో 10 మంది విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారు. మొత్తం 88 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో పది మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో జిల్లా విద్యాశాఖ, గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా విద్యార్థులను ఖమ్మం తరలించారు. పాఠశాల తరగతి గదులను శానిటైజ్ చేసి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో కరోనా లక్షణాలు లేవని 90శాతం మంది బాధితులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత 24 గంటల్లో 364 మందికి కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఈ తరహా బాధితులు సుమారు 70 శాతం మంది ఉండగా.. తాజాగా 90 శాతానికి పెరగడంపై ఆరోగ్య శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఎటువంటి లక్షణాల్లేకుండా కరోనా నిర్ధారణ కావడం వల్ల.. బాధితుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలేవీ రావని, ఓ విధంగా చూస్తే ఇది ఆహ్వానించదగిన పరిణామమేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయితే దీని వల్ల నష్టం జరిగే ప్రమాదమూ పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story