Hyderabad: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. మృతుల్లో 18 నెలల బాలుడు..

Hyderabad: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. మృతుల్లో 18 నెలల బాలుడు..
Hyderabad: సైబరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి వినాయక నగర్‌లో విషాదం చోటు చేసుకుంది.

Hyderabad: సైబరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి వినాయక నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. 18 నెలల బాలుడు సహా.. ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలుడు, బాలుడి అమ్మమ్మ లలిత మృతి చెందగా.. బాలుడి తల్లి దివ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అసలు సూసైడ్‌ చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story