తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గ్రేటర్ ఫలితాలే పునరావృతం : బండి సంజయ్

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గ్రేటర్ ఫలితాలే పునరావృతం : బండి సంజయ్

తెలంగాణలో కారు సారు ఇక రారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గ్రేటర్ ఫలితాలే పునరావృతం : బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గ్రేటర్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అన్నారు. కార్యకర్తల వీరోచిత పోరాట వల్లే గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించామని స్పష్టంచేశారు. గ్రేటర్ ఎన్నికల విజయాన్ని తెలంగాణ ఎన్నికల కమిషనర్, డీజీపీలకు అంకితం చేస్తామన్నారు. పోలీసులు, ఎంఐఎం కార్యకర్తలు ఎన్ని దాడులు చేసిన ప్రజలు బీజేపీ పక్కన నిలబడి అభ్యర్థులను గెలిపించారని సంజయ్ వెల్లడించారు.

తెలంగాణలో రోజురోజుకూ బీజేపీ బలం పెరుగుతుందని.. టీఆర్ఎస్ బలం పడిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన‌్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసా వహించకుండా ఇప్పటికీ తమ అభ్యర్థులను వేధిస్తున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోవడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ‌్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story