Bandi Sanjay: బండి సంజయ్ జాగరణ దీక్ష.. జీవో 317ను రద్దు చేయాలంటూ..

Bandi Sanjay (tv5news.in)

Bandi Sanjay (tv5news.in)

Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈరోజు జాగరణ దీక్ష చేపట్టనున్నారు.

Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈరోజు జాగరణ దీక్ష చేపట్టనున్నారు. జీవో 317ను రద్దు చేయాలనే డిమాండ్‌తో కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో చేపట్టనున్న బండి సంజయ్‌ దీక్షకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు జాగరణ దీక్ష నిర్వహిస్తారు.

నిద్రపోతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మేల్కొలపడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బండి సంజయ్‌ వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story