Kishan Reddy : ఈటెలను కలవడంలో తప్పేంటి?
By - TV5 Digital Team |25 May 2021 1:39 PM GMT
Kishan Reddy : మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈటల ఇప్పటివరకూ తనను కలవలేదని స్పష్టం చేశారు.
Kishan Reddy : మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈటల ఇప్పటివరకూ తనను కలవలేదని స్పష్టం చేశారు. తనను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనన్న కిషన్ రెడ్డి.. ఈటెల తాను 15 ఏళ్లుగా కలిసి పనిచేసామని.. కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అని అనుకోలేమని అన్నారు. ఎప్పుడు కలుస్తాం అనేది ఇంకా నిర్ణయించలేదని.. అందర్ని కలుస్తున్నానని .. మిమ్మల్ని కూడా కలుస్తానని ఈటెల చెప్పినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక అటు హుజురాబాద్ ఉపఎన్నికల వస్తే పోటీలో ఉండాలా వద్దా అనేది ఇంకా చర్చించలేదని ... పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com