జీహెచ్ఎంసీ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశం..!
By - TV5 Digital Team |11 April 2021 5:30 AM GMT
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే GHMC కార్యాలయంలోకి ఇకపై అనుమతించరు.
ఇప్పటివరకు GHMCలో నో మాస్క్.. నో ఎంట్రీ మాత్రమే అమలు చేసేవారు. కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే GHMC కార్యాలయంలోకి ఇకపై అనుమతించరు. GHMC సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికుల నుంచి కమీషనర్ వరకు అందరికీ టీకాలు వేయించాలని సూచించారు. అన్ని స్థాయిల్లో కలిపి GHMCలో 30వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. ఈనెల 15వ తేదీలోపు సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకులకు సైతం వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com