నాలుగేళ్లలో దళిత సాధికారతకు రూ.40 వేల కోట్లు: సీఎం కేసీఆర్‌

నాలుగేళ్లలో దళిత సాధికారతకు రూ.40 వేల కోట్లు: సీఎం కేసీఆర్‌
రానున్న మూడు, నాలుగేళ్లలో దళితుల సాధికారత కోసం 35 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

రానున్న మూడు, నాలుగేళ్లలో దళితుల సాధికారత కోసం 35 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ బడ్జెట్... ఎస్సీ సబ్ ప్లాన్‌కు అదనం అని తెలిపారు. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలు గుర్తించి... సమిష్టి కృషితో పరిష్కార మార్గాలు కనుగొనాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలు విడివిడిగా గుర్తించాలని అన్నారు. ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశంలో దళిత సాధికారత పథకంపై నేతలతో చర్చిస్తున్న కేసీఆర్‌... ఈ మేరకు వెల్లడించారు. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పని చేయడానికి నిశ్చయించుకుందని.... అందరూ కలసి రావాలని కోరారు.

భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలని సూచించారు. గోరేటి వెంకన్న ఆలపించిన.. గల్లీ చిన్నది పాటను మనసు పెట్టి వింటే.. దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని తెలిపారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలనుకుంటోదని చెప్పారు.

రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల తరహాలో... నేరుగా ఆర్ధిక సాయం అందే విధంగా... అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నేతల్ని సీఎం కేసీఆర్ కోరారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని అన్నారు. అట్టడుగున ఉన్న వారి నుంచి సాయం ప్రారంభించి, అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలని కేసీఆర్‌ తెలిపారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని భావించినట్టు కేసీఆర్‌ చెప్పారు. మరో 500 కోట్ల రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి... సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే దృఢ సంకల్పమని కేసీఆర్‌ అన్నారు. అటు... సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సమాచారం ఇచ్చారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ ఫ్లోర్‌ లీడర్లకూ ఆహ్వానం పంపారు. కానీ... సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది.

Tags

Read MoreRead Less
Next Story