KCR : ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్...!

KCR :  ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్...!
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్ధులకు ఇక్కడ విద్యను అందించే ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు. వేలాదిమంది విద్యార్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విద్యాసంవత్సరం మధ్యలో వచ్చారని.. వారిని ఆదుకోవాలని సూచించారు.

రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ లో విద్యకోసం వెళ్లిన భారతీయ విద్యార్ధులు 20వేల మంది తిరిగి వెనక్కి వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరిలో 7వందల మంది తెలంగాణకు చెందిన విద్యార్ధులు ఉన్నారని.. యుద్ధం నేపథ్యంలో ఇప్పుడే ఉక్రెయిన్ వెళ్లి చదువులను కొనసాగించే అవకాశం లేదని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధులు చదువును కొనసాగించే అవకాశం కల్పించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story