కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో కరోనాకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను.. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదంది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని.. నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని పేర్కొంది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నా ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ.. ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.రెండో దశ కరోనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడంలేదని హైకోర్టు కామెంట్ చేసింది.


Tags

Read MoreRead Less
Next Story