రాష్ట్రంలో కరోనా.. జీహెచ్‌ఎంసీలో..

రాష్ట్రంలో కరోనా.. జీహెచ్‌ఎంసీలో..
మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చుకుంటే కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 857 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,51,183కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మ‌ృతుల సంఖ్య 1,381కి చేరింది. తాజాగా 1,594 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,30,568కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 16,449 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిల 250 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story