తెలంగాణలో కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ కలకలం

తెలంగాణలో కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ కలకలం
బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణలో కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కొత్తరకం వైరస్‌ బయటపడిన తరువాత.. బ్రిటన్‌ నుంచి తెలంగాణకు 1216 మంది వచ్చారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇందులో 970 మందిని గుర్తించారు. వీరిలో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో 154 మంది ట్రేస్ కావాల్సి ఉంది. ఇప్పటికే కొందరి నమూనాల జీన్ మ్యాప్ రిపోర్ట్ రెడీ చేసింది సీసీఎంబి. పాజిటివ్ వచ్చిన వాళ్లలో స్ట్రెయిన్‌ లక్షణాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.


Tags

Read MoreRead Less
Next Story