ఇంటి ఓనర్లే టార్గెట్... మత్తుమందు ఇచ్చి మొత్తం దోచుకుంటారు..!

ఇంటి ఓనర్లే టార్గెట్... మత్తుమందు ఇచ్చి మొత్తం దోచుకుంటారు..!
భార్యాభర్తలుగా నమ్మించి ఇళ్లు అద్దెకు తీసుకొని.. ఆ తర్వాత అదును చూసి ఇంటి యాజమానురాలికి మత్తు మందు ఇచ్చి హత్య చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

షాద్‌నగర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో జరిగిన ఇద్దరి మహిళల హత్య, దోపిడీ కేసులను శంషాబాద్ పోలీసులు చేధించారు. భార్యాభర్తలుగా నమ్మించి ఇళ్లు అద్దెకు తీసుకొని.. ఆ తర్వాత అదును చూసి ఇంటి యాజమానురాలికి మత్తు మందు ఇచ్చి హత్య చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బిగుగొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, నాగలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

గతేడాది నవంబర్‌లో షాద్‌నగర్ చటాన్‌పల్లిలో తామిద్దరూ భార్యాభర్తలని నమ్మించి.. ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. యాజమాని సువర్ణకు కల్లులో నిద్ర మాత్రలు కలిపి తాగించారు. అనంతరం అపస్మారక స్థితికి చేరుకోగానే గొంతు నులిమి హత్య చేసి అందినకాడికి దోచుకున్నారు. తర్వాత అక్కడ నుంచి సూర్యాపేటకు మకాం మార్చారు. అక్కడ కూడా ఇదే తరహాలో గదిని అద్దెకు తీసుకొని ఇంటి యజమాని లక్ష్మీని హత్య చేశారు.

నిందితుల నుంచి 20 తులాల బంగారం, 25 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నామని శంషాబాద్ డీఎస్పీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇళ్లు అద్దె కోసం వచ్చే వారి నుంచి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ ప్రకాష్ రెడ్డి సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story