రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరా పార్కులో దీక్ష : భట్టి

రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరా పార్కులో దీక్ష : భట్టి
ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా ఈ నెల 9న శాసనసక్ష పక్షం తరుపున ఇందిరాపార్కులో దీక్ష చేయనున్నట్లు తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా ఈ నెల 9న శాసనసక్ష పక్షం తరుపున ఇందిరాపార్కులో దీక్ష చేయనున్నట్లు తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 43 రోజులుగా రైతులు దీక్షలు చేస్తోన్న కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ బంద్‌లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు స్పందించడం లేదంటూ ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం అంటే కేసీఆర్‌ తన అసమర్థతను చెప్పకనే చెప్పారన్నారు. కేంద్రం వ్యవసాయ బిల్లులను ఉపసంహహించాల్సిందేనన్నారు భట్టి విక్రమార్క.

Tags

Read MoreRead Less
Next Story