Dk Aruna : కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలింది..!
By - TV5 Digital Team |8 Nov 2021 2:00 PM GMT
Dk Aruna : కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఉప ఎన్నిక కేసీఆర్ కు కళ్లు తెరిపించిందన్నారు.
Dk Aruna : కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఉప ఎన్నిక కేసీఆర్ కు కళ్లు తెరిపించిందన్నారు. కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పే సీఎం.. దేశంలో లేరన్నారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుంటే..కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారన్నారు. 24 రాష్ట్రాల్లో పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గిస్తే.. తెలంగాణలో ఎందుకు తగ్గించరో చెప్పాలన్నారు. వ్యాట్ తగ్గించే వరకు కేసీఆర్ ను విడిచిపెట్టబోమన్నారు. కేసీఆర్ అహంకార ధోరణితో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. ఆ తర్వాత సంపాదించిన ఆస్తులెన్నో కేసీఆర్ చెప్పాలన్నారు డీకే అరుణ డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com