వనస్థలిపురం రైతు బజార్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రారంభించిన కేటీఆర్‌

వనస్థలిపురం రైతు బజార్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌ వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో... 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లను.. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు... GHMC కమిషనర్‌ లోకేష్ కుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సెల్లార్‌, స్టిల్ట్‌, 9 అంతస్తుల్లో... మూడు బ్లాకుల్లో... 324 డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు నిర్మించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇళ్లలో.. ఒక హాల్‌, రెండు డబుల్‌ బెడ్‌రూమ్‌లు, ఓ కిచెన్‌, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 8 లక్షల 65 వేల రూపాయలు ఖర్చు చేశారు. బుధవారం ఆ ఇళ్లను.. లబ్దిదారులకు ఉచితంగా అందించారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా రెండు పడక గదుల నిర్మాణం చేపట్టినట్టు కేటీఆర్‌ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 72 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. ఈ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్దిదారులకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్‌.


Tags

Read MoreRead Less
Next Story