దుబ్బాకలో ఓటెత్తిన జనం..
By - kasi |3 Nov 2020 11:55 AM GMT
దుబ్బాకలో జనం ఓటెత్తారు.. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ మరో 30 నిమిషాల్లో ముగియనుంది.. ఈ నేపథ్యంలో ఓటు వేయని ప్రజలంతా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు.. చివరి అరగంటలో వృద్ధులు, కోవిడ్ రోగుల కు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.. వారంతా నిబంధనలకు లోబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు..
దుబ్బాకలో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు.. పోలింగ్ మొదలైన మొదటి రెండు మూడు గంటల్లోనే భారీగా ఓట్లు పోలయ్యాయి.. మధ్యాహ్నం కొంత మందకొడిగా సాగినా ఆ తర్వాత మళ్లీ ఓటింగ్ శాతం పెరిగింది.. కొందరు కరోనా బాధితులు కూడా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com