కిషన్‌ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి-ఎర్రబెల్లి దయాకర్

కిషన్‌ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి-ఎర్రబెల్లి దయాకర్
Errabelli Dayakar Rao: కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు సంతోషించామని, కాని తెలంగాణ కడుతున్న పన్నుల్లో సగం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వట్లేదన్నారు. ఈ ఏడేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందెంతో చెప్పాలన్నారు. వరంగల్ జిల్లాకు కిషన్‌ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో పెడతామన్న గిరిజన వర్సిటీ సంగతి ఏమైందని నిలదీశారు. ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని, జన ఆశీర్వాద యాత్రకు ప్రజా స్పందన లేదని కామెంట్ చేశారు.

కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని విమర్శించారు బాల్క సుమన్. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని, ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం తెగ అమ్ముతోందని కామెంట్ చేశారు. ప్యాకేజీల పేరుతో కేంద్రం ప్రజల చెవుల్లో పూలు పెడుతోందన్నారు. ప్రజల ఆస్తులను అంబానీ, అదానీలకు కేంద్రం కట్టబెడుతోందని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story