దళిత బంధు డబ్బులు రావాలంటే టీఆర్‌ఎస్‌ జెండాలు పట్టుకోవాలా : ఈటల

దళిత బంధు డబ్బులు రావాలంటే టీఆర్‌ఎస్‌ జెండాలు పట్టుకోవాలా : ఈటల
Etela Rajendar : హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

Etela Rajendar : హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. దళిత బంధు పథకం అమలు విషయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అవలంభిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. దళిత బంధు డబ్బులు రావాలంటే టీఆర్ఎస్‌ కు జై కొట్టాలంటున్నారని.. ఇది ప్రజల డబ్బే అన్న విషయం మరచిపోవద్దని ఈటల అన్నారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగలేదని అంటున్న వారు.. తనతో వస్తే.. జరిగిన అభివృద్ధిని చూపిస్తానంటూ సవాల్‌ విసిరారు. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో... నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అధికార పార్టీ పంచుతున్న మద్యం తాగి ప్రజలంతా తాగుబోతులుగా మారుతున్నారని... ఊళ్లలో గొడవలు జరుగుతున్నాయని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story