కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం..
నిజామాబాద్ కలెక్టరేట్లో రాములు అనే ఓ రైతు తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. తన భూమిని అభిలాష్ అనే వ్యక్తి కబ్జా చేశాడని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రాములు.. ఒంటిపై కిరోసిన్ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు.
రాములు డిచిపల్లి మండలం యానం పల్లికి చెందిన రైతు. ఉన్న ఎకరం పొలాన్ని సాగు చేసుకుని జీవిస్తున్నాడు. అయితే అభిలాష్ అనే వ్యక్తి...ఈ ఎకరం పోలాన్ని కబ్జా చేశాడు. తనకు న్యాయంచేయాలంటూ.. అధికారులకు విన్నవించుకున్నాడు. కానీ రెవెన్యూ అధికారులెవరూ స్పందించలేదు. పైగా అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేశావంటూ.. అభిలాష్... తనపై దౌర్జన్యానికి దిగుతూ తనపై దాడి చేశాడంటున్నాడు రాములు. దీంతో కలెక్టరేట్ వచ్చిన రాములు.... కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యయత్నం చేశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com