రాజేంద్రనగర్‌‌‌లో అగ్ని ప్రమాదం.. గోదాంలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు

రాజేంద్రనగర్‌‌‌లో అగ్ని ప్రమాదం.. గోదాంలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పరుపుల గోదాంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పరుపుల గోదాంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించాయి. పక్కన మరో గోదాంకు కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న.. అగ్నిమాపక సిబ్బంది.. నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాంలోంచి కార్మికులు బయటకు రావటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాధంలో భారీ ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story