స్కూల్లో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన స్కూల్ ఆఫీసు రూం
By - TV5 Digital Team |4 Feb 2021 3:51 PM GMT
హైదరాబాద్ గౌలిపురాలోని శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో స్కూలు ఆఫీసు రూం పూర్తిగా దగ్ధమైంది.
హైదరాబాద్ గౌలిపురాలోని శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో స్కూలు ఆఫీసు రూం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మంటలను చూసి భయంతో పరుగులు తీశారు. కొందరైతే ఆ స్కూల్ రెండో అంతస్తు నుంచి పక్క భవనంపైకి దూకారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలను అదుపు చేశారు. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com