శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో భాగంగా 54 లక్షలు విలువ చేసే కరెన్సీ పట్టుబడింది.

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో భాగంగా 54 లక్షలు విలువ చేసే కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న ఇద్దరి నుంచి ఈ కరెన్సీను అధికారులు సీజ్‌ చేశారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా... తినుబండారాల్లో అమలర్చి తీసుకెళ్లేందుకు యత్నించారు. అనుమానంతో వారి బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కరెన్సీ బయటపడింది. కస్టమ్స్‌ అధికారులు ఇద్దర్ని నిందితులను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story