శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
By - Nagesh Swarna |2 Feb 2021 10:45 AM GMT
కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా 54 లక్షలు విలువ చేసే కరెన్సీ పట్టుబడింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా 54 లక్షలు విలువ చేసే కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్కు వెళ్తున్న ఇద్దరి నుంచి ఈ కరెన్సీను అధికారులు సీజ్ చేశారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా... తినుబండారాల్లో అమలర్చి తీసుకెళ్లేందుకు యత్నించారు. అనుమానంతో వారి బ్యాగ్ను తనిఖీ చేయగా.. కరెన్సీ బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఇద్దర్ని నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com