మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు అస్వస్థత
హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మాజీమంత్రి ఈటెల రాజేందర్ స్వల్ప అ స్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా కాళ్లకు నొప్పులు, దగ్గు జ్వరంతో ఆయన బాధపడుతున్నరు.ఈ మేరకు డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు ఆయన ప్రజాదీవెన యాత్రలో భాగంగా వీణవంక మండలంలో పర్యటించారు. మంత్రులకే దొరకని సీఎం కేసీఆర్, ఎంపీటీసీ సర్పంచ్లతో మాట్లాడుతున్నాడని అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను ఓడగొట్టడానికి నియెజక వర్గానికి వస్తున్నారన్నారు. నేను అందరికి సహయం చేసేవాడిని.. నాకు కష్టకాలం వచ్చిందన్నారు ఈటెల. నాకు మనిషిలో ఓటు కనపడలేదని.. ఓటు మాత్రమే కనిపించదన్నారు. సీఎం కేసీఆర్ కి మాత్రం మనిషి కనిపించడని .. ఓటు మాత్రమే కనిపిస్తుందని ఈటెల స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com