గ్రేటర్ హీట్.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
By - Nagesh Swarna |20 Nov 2020 6:37 AM GMT
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీరేం చేశారంటే మీరేం చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇక వరద సాయంలో రాజకీయాలు హీటెక్కాయి. బాధితులకు 10 వేలు సాయం చేసి నగర ప్రజలను ఆదుకున్న ఘనత టీఆర్ఎస్దే అన్నారు మంత్రి కేటీఆర్. ఈసీకి లేఖలు రాసి బీజేపీ సాయాన్ని ఆపివేయించిందని మండిపడ్డారు.
అటు టీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు బండి సజయ్. తాను ఈసీకి లేఖ రాసి సాయం ఆపించాననే ఆరోపణలు అవాస్తవమన్నారు. జీహెచ్ఎంసీలో విజయం సాధిస్తే వరద బాధితులకు 25 వేల సాయం ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ వరద బాధితులకు కేంద్రం 550కోట్లు ఇచ్చిందని సంజయ్ గుర్తు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com