హైదరాబాద్‌లో మరోసారి భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌లో మరోసారి భారీగా బంగారం పట్టివేత
చౌటప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద 12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. చౌటప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద 12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో రహస్యంగా తరలిస్తున్న కోల్‌కతా నుంచి చెన్నై తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని కోల్‌కతా గోల్డ్‌ మాఫియా ముఠాకు అప్పగించినట్లు విచారణలో డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story