వరంగల్ రూరల్ జిల్లాలో అదుపుతప్పి బావిలో పడిన జీప్
By - kasi |27 Oct 2020 1:20 PM GMT
వరంగల్ రూరల్ జిల్లాలో ఓ జీప్ అదుపుతప్పి బావిలో పడింది. ఆ జీపులో 15 మంది ప్రయాణికులున్నారు. ఐతే.. వెంటనే స్పందించిన స్థానికులు.. 12 మందిని సురక్షితంగా బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. బావి నిండా నీరు ఉండడంతో.. గాలింపు కష్టమవుతోంది. సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com