Khammam : ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ!

Khammam  : ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ!
ఖమ్మం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను TRS అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసింది. మేయర్ గా పునుకొల్లు నీరజ,

ఖమ్మం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను TRS అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసింది. మేయర్ గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రా పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. వీరి ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీల్డ్ కవర్ తెరిచి, ఎన్నిక నిర్వహించనున్నారు.

ఇటీవల జరిగిన ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 26వ డివిజన్‌ నుంచి పునుకొల్లు నీరజ, 37వ డివిజన్‌ నుంచి ఫాతిమా జోహ్రా విజయం సాధించారు.ఖమ్మం కార్పొరేషన్‌కు తెరాస ఎన్నికల పరిశీలకుడిగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

అటు గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. గుండు సుధారాణి వరంగల్‌ 29వ డివిజన్‌ నుంచి గెలుపొందగా.. 36వ డివిజన్‌ నుంచి రిజ్వానా షమీమ్‌ విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story