Kishan Reddy: సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: కిషన్రెడ్డి
By - Divya Reddy |26 April 2022 8:15 AM GMT
Kishan Reddy: సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Kishan Reddy: సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి ఎంప్లాయిస్కు ఇళ్ల పట్టాలిచ్చి, ఓ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడున్నరేళ్లలో తెలంగాణ పంచాయతీలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో, కేసీఆర్ ఎన్ని నిధులు విడుదల చేశారన్న దానిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టను కేంద్రం చేతికి అప్పగిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో దళితబంధు రావడానికి హుజురాబాద్ ఎన్నికలే కారణమని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com