పోలీసుల సాక్షిగా ఘర్షణపడ్డ ప్రేమికులు
By - Nagesh Swarna |31 Dec 2020 11:16 AM GMT
పోలీసుల సాక్షిగా..ప్రియుడిపై ప్రియురాలు విరుచుకుపడింది. కొట్టుకొంటున్న వీరిద్దరిని విడదీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
హైదరాబాద్ నాంపల్లిలోని మానవహక్కుల కమిషన్లో.. కమిరెడ్డి కవిత అనే యువతి.. తన ప్రియుడిపై ఎదురుదాడి చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడని.. అశోక్ కుమార్ నాయక్ అనే యువకుడిని HRC ముందు కవిత నిలదీసింది. కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన అశోక్ కుమార్, వనపర్తికి చెందిన కవిత ఇద్దరూ ప్రేమించుకున్నారు. హైదరాబాద్ AS రావు నగర్లో 2017 నుంచి కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. తనను వదిలేశాడని.. బాధిత యువతి పోలీసులు, కోర్టు, HRCని ఆశ్రయించింది. అయితే తనను నిలదీసిన కవితపై ప్రియుడు ముందుగా చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత.. పోలీసుల సాక్షిగా..ప్రియుడిపై ప్రియురాలు విరుచుకుపడింది. కొట్టుకొంటున్న వీరిద్దరిని విడదీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com