వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటెల
By - TV5 Digital Team |19 April 2021 11:03 AM GMT
తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. పలు మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో 13 వందల కేంద్రాలలో నిరంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఈటల తెలిపారు. కరోనా బాధితులు, 45 ఏళ్లు పైబడిన వారు కచ్చితంగా రెండుసార్లు టీకా డోసులు వేయించుకోవాలని మంత్రి సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com