దళిత బంధుపై కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు- హరీష్ రావు

దళిత బంధుపై కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు- హరీష్ రావు
Harish Rao: హుజురాబాద్‌లో దళిత బంధుపై కాంగ్రెస్, బీజేపీ గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు ఆర్ధిక మంత్రి హరీష్ రావు.

హుజురాబాద్‌లో దళిత బంధుపై కాంగ్రెస్, బీజేపీ గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు ఆర్ధిక మంత్రి హరీష్ రావు. చాలా మంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు ప్రారంభిస్తుంటే కొందరు నేతలు కావాలనే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దళితులపై బీజేపీకి ప్రేమ ఉంటే.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికుట్రలు చేసినా.. దళితబంధు ఇచ్చితీరుతామని.. ఇందుకోసం 2వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. దళిత బంధు వల్ల 20వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story