హుజురాబాద్‌ నియోజకవర్గంలో 4వేల డబుల్‌ బెడ్‌ రూంలు మంజూరు చేశాం ; మంత్రి హరీష్‌

హుజురాబాద్‌ నియోజకవర్గంలో 4వేల డబుల్‌ బెడ్‌ రూంలు మంజూరు చేశాం ; మంత్రి హరీష్‌
ఈ సమస్యను పరిష్కరించేందుకు కోటి రూపాయలతో చిలకవాగుపై బ్రిడ్జ్‌తో సహా బీటీరోడ్డు కోసం 40 లక్షలు మంజూరు చేస్తామన్నారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ నాలుగు వేల డబుల్ బెడ్‌ రూంలు మంజూరు చేసినా.. అప్పట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు మంత్రి హరీష్‌ రావు. పట్టణంలో వర్షం వస్తే.. చిలుకవాగుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కోటి రూపాయలతో చిలకవాగుపై బ్రిడ్జ్‌తో సహా బీటీరోడ్డు కోసం 40 లక్షలు మంజూరు చేస్తామన్నారు. పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేసి వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసి పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పిస్తామన్నారు మంత్రి హరీష్‌. రంగనాయకుల గుట్ట వద్ద పాటిమీద ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌ కూడా ఉన్నారు. అనంతరం పెద్దమ్మతల్లి దేవాలయానికి శంకుస్థాపన చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story