భైంసాలో పథకం ప్రకారమే హిందువులపై దాడులు : మంత్రి కిషన్ రెడ్డి

భైంసాలో పథకం ప్రకారమే హిందువులపై దాడులు : మంత్రి కిషన్ రెడ్డి
భైంసాలో పథకం ప్రకారం హిందువులపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

భైంసాలో పథకం ప్రకారం హిందువులపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్‌ఎస్‌ సహాయంతో, మజ్లిస్ పార్టీ నేతృత్వంలోనే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసుల కళ్లముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. నాలుగేళ్ల చిన్నారిని యువకుడు అత్యాచారం చేస్తే పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు.

పోలీసులు నేరస్తుల మీద చర్యలు తీసుకోకుండా టీఆర్‌ఎస్‌ అడ్డుపడుతోందన్నారు కిషన్‌ రెడ్డి. మజ్లిస్ ఉన్న పాత బస్తీ, భైంసాలో మాత్రమే అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయో కుహనా లౌకికవాదులు ఆలోచించాలని అన్నారు. కేటీఆర్‌ షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని, ఏ అధికారంతో, ఏ ప్రాతిపదికన అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారని ప్రశ్నించారు. భైంసాలో జరిగిన ఘటనలపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతామన్నారు కిషన్ రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story