బండి సంజయ్కి సవాలు విసిరిన మంత్రి కేటీఆర్..
By - TV5 Digital Team |20 April 2021 5:45 AM GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. దమ్ముంటే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. దమ్ముంటే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట మండల కేంద్రంలో మంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. చేతనైతే కేంద్రం నుంచి రాష్ట్రాభిద్దికి నిధులు మంజూరు చేయించాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురావాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com