స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సమీక్ష..!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని కేటీఆర్ అన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి అంశంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలైన మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ప్రాజెక్టులతో కళకళలాడుతున్నాయన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ దేశంలో రెండో హరిత విప్లవానికి నాంది పలికిందన్నారు మంత్రి కేటీఆర్. అలాగే రాష్ట్రంలో మాంసం, పాల ఉత్పత్తి, మత్స్య రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. టియస్ఐఐసి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు పరిశ్రస్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సమీక్షమలు, వ్యవసాయం, సివిల్ సప్లైస్ అధికారులు పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com