జవాన్ పార్ధీవ దేహాన్ని మోసిన కమిషనర్ సజ్జనార్

జవాన్ పార్ధీవ దేహాన్ని మోసిన కమిషనర్ సజ్జనార్
కమిషనర్ సజ్జనార్ స్వయంగా జవాన్ పార్ధీవ దేహాన్ని మోశారు.

ఛత్తీస్‌గడ్‌లోని బీజూపూర్‌ మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ శాఖమూరి మురళీకృష్ణ భౌతిక కాయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.

ఈ సందర్బంగా మురళీ కృష్ణ పార్ధీవ దేహానికి CRPF అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ లు ఘన నివాళులు అర్పించారు.

కమిషనర్ సజ్జనార్ స్వయంగా జవాన్ పార్ధీవ దేహాన్ని మోశారు. సైనిక వందనం అనంతరం మురళీకృష్ణ భౌతిక కాయాన్ని రోడ్డుమార్గం గుండా గుంటూరుకు తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story