బీజేపీకి మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా..!

బీజేపీకి మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా..!
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్టు చెప్పారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్టు చెప్పారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలిజేయాల్సిందిగా ఆహ్వానిస్తే... బండి సంజయ్‌కి చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు మోత్కుపల్లి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ మీద విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story