ఎన్నికల వరకే రాజకీయాలుంటాయి.. ఆ తర్వాత బాధ్యత అధికారులదే : బండి సంజయ్
By - Admin |21 Dec 2020 12:10 PM GMT
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయన్న ఆయన తదుపరి ప్రజాసంక్షేమం, అభివృద్దికోసం అందరు కృషి చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్లో జిల్లా అధికారులతో అభివృద్ది సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని సమీక్షించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి వ్యక్తికి, ప్రతి గ్రామానికి అందేవిధంగా చూడాలని సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com