భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత .. కరోనా ఇబ్బంది పెట్టినా..!

భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత .. కరోనా ఇబ్బంది పెట్టినా..!
సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనా పరిస్థితులతో గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పగా.. దానికి ఆమె సమాధానం ఇచ్చారు. "కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టనా.. నన్ను నమ్మి నాకు పూజలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా. అమ్మకి ఇంత చేసినా ఏం ఒరగలేదు అనొద్దు.. ప్రతి ఒక్కరినీ నేను కాచుకుంటా. ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను" అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story