తెలంగాణలో ఆల్‌టైమ్‌ హైకి చేరిన నాన్‌వెజ్ రేట్లు..!

తెలంగాణలో ఆల్‌టైమ్‌ హైకి చేరిన నాన్‌వెజ్ రేట్లు..!
ఓ పక్క కరోనా కేసులు భయపెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో విపరీతంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

ఓ పక్క కరోనా కేసులు భయపెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో విపరీతంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ జనంలో ఆ భయం పెద్దగా కనిపించడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా జనమే. ఫిష్ మార్కెట్‌, చికెన్ మార్కెట్ అని లేదు.. జనం ఎగబడుతున్నారు. మరోవైపు.. ఈసారి నాన్‌వెజ్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. చికెన్‌ 250-300 మధ్య ఉంటుంటే, మటన్‌ కూడా వెయ్యికి చేరువవుతోంది. చేపల ధరలు కూడా పైపైకే వెళ్తున్నాయ్.

Tags

Read MoreRead Less
Next Story