డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో స్వీయ గృహ ప్రవేశాలు!

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో స్వీయ గృహ ప్రవేశాలు!
ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా.. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించకపోవడంతో నిరసనగా లబ్ధిదారులు స్వీయ గృహ ప్రవేశాలు చేసుకున్నారు.

ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా.. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించకపోవడంతో నిరసనగా లబ్ధిదారులు స్వీయ గృహ ప్రవేశాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బల్వంతాపూర్‌లో 60 మంది డబుల్ బెడ్‌ రూం లబ్దిదారులుండగా.. ఇప్పటివరకు 21 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మాత్రమే నిర్మించారు. అయినా వాటిని కూడా అధికారులు కేటాయించకపోవడంతో.. లబ్ధిదారులకు వారికి నచ్చిన ఇళ్లను కేటాయించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు.. అందరినీ ఖాళీ చేయించారు. ప్రభుత్వం పంపిణీ చేసేంత వరకు ఎవరైనా గృహప్రవేశం చేస్తే.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story