తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం
By - Nagesh Swarna |10 Jan 2021 9:36 AM GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అవినీతి చేశానని సంజయ్ చెబుతున్నారని.. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం చేత దర్యాప్తు చేయించి నిరూపించాలని సవాల్ విసిరారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను ఏంటో బీజేపీకి రుచి చూపించానని.. ఖమ్మంలో కూడా ఇదే జరుగుతుందన్నారు. ఖమ్మం ప్రజలు అభివృద్ధికి ఓట్లు వేస్తారు తప్ప మత రాజకీయాలకు కాదని తెలిపారు.
ఖమ్మం జిల్లాకు బీజేపీ అన్యాయం చేసిందని..బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. పోలవరం నుంచి ఏడు మండలాలు విడగొట్టి ఈ జిల్లాకు అన్యాయం చేశారని పువ్వాడ విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com