సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్.. ఐదుగురు మృతి
నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగకుండా దూసుకెళ్లిన కారును.. టిప్పర్ ఢీకొడంతో ఐదుగురు చనిపోయారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో చోటుచేసుకుంది. విప్రో సర్కిల్ వద్ద స్విఫ్ట్ కారు సిగ్నల్ జంప్ చేసి అతి వేగంగా దూసుకెళ్లింది. ఈ సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. నలుగురు స్పాట్లోనే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కన్నుమూశారు. మృతులు.. కాట్రగడ్డ సంతోష్, చింతా మోహన్, భరద్వాజ, రోషన్, పవన్గా గుర్తించారు. వీరంతా మాదాపూర్ మెన్స్ హాస్టల్స్లో ఉంటున్నారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. టిప్పర్ బోల్తా పడింది. అందులో ఉన్న డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులో ఉన్న ఐదుగురు మద్యం సేవించినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com