టెక్సాస్లో ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
అమెరికా టెక్సాస్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కుమారుడు భరత్రెడ్డితో పాటు దంపతులు నరసింహారెడ్డి, లక్ష్మి మృతి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ కూతురు మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.మృతుల స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంటగా గుర్తించారు.
కుమార్తె వివాహం కుదుర్చుకునేందుకు..ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లారు నరసింహారెడ్డి దంపతులు. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం మొత్తం కుటుంబాన్ని కబలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతి వార్తను తట్టుకోలేకపోతున్నారు. వెంటనే పార్థీవ దేహాలను స్వస్థలానికి తరలించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు. రోడ్డు ప్రమాదంతో నరసింహారెడ్డి కుటుంబం మృత్యువాత పడడంతో.. ఆయన స్వస్థలం పెద్ద చింతకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com