YS Sharmila: తెలంగాణ రైతుల కోసం 72 గంటల దీక్ష- షర్మిల
By - Prasanna |10 Nov 2021 10:57 AM GMT
YS Sharmila: గతంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పెత్తనం ఏంటన్న కేసీఆర్... ఇప్పుడెందుకు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
YS Sharmila: తెలంగాణ రైతుల కోసం 72గంటల దీక్ష చేస్తా అని ప్రకటించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వం రైతుల వడ్లు కొనాలనే డిమాండ్ తో దీక్షకు దిగబోతున్నట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లో దీక్ష మొదలవుతుందన్నారు షర్మిల. గతంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పెత్తనం ఏంటన్న కేసీఆర్... ఇప్పుడెందుకు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
వడ్లు కొనం అని చెప్పడం ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన షర్మిల ఎలక్షన్ కోడ్ ఉండటంతో ప్రజాప్రస్థాన యాత్రకు విరామం ఇస్తున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com