కాశీ అన్న‌పూర్ణ‌కు ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక పూజ‌లు!

కాశీ అన్న‌పూర్ణ‌కు ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక పూజ‌లు!
నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌, సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ‌, కుటుంబ సభ్యులు ఈ రోజు కాశీ అన్నపూర్ణా దేవికి పూజ‌లు చేశారు. ఈ విషయాన్ని కవిత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌, సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ‌, కుటుంబ సభ్యులు ఈ రోజు కాశీ అన్నపూర్ణా దేవికి పూజ‌లు చేశారు. ఈ విషయాన్ని కవిత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మ‌హాదేవుడికి, పార్వతీమాత‌కు పూజ‌లు చేయ‌డం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పూజల అనంతరం వార‌ణాసిలోని ప‌లు ఆల‌యాల‌ను వారు సందర్శించారు. కాగా నిన్న వార‌ణాసికి వారు చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్న ముందుగా అస్సీఘాట్‌కు చేరుకొని, అక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్‌ వరకు బోట్‌లో ప్రయాణించారు. అక్కడ గంగానదికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్టు కవిత పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story