కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత

కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత
లుంబినీ పార్క్ వద్దకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

కాంగ్రెస్ చేపట్టిన రాజ్‌భవన్‌ ఘోరావ్ కార్యక్రమంలో ఉద్రిక్తత తలెత్తింది. ఢిల్లీలో రైతుల ఆందోళనలకు సంఘీభావంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో లుంబినీ పార్క్ నుంచి రాజభవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అటు కాంగ్రెస్ నేతల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు రాజ్ భవన్ ఘోరావ్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. లుంబినీ పార్క్ వద్దకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.


Tags

Read MoreRead Less
Next Story